నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-06-23T06:52:27+05:30 IST
జగన్రెడ్డి ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగు తోందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎ న్ఎస్ఎఫ్) నాయకులు విమర్శించారు. ఈ సంద ర్భంగా మంగళవారం ఒంగోలులోని టీడీపీ కార్యా లయంలో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలె ండర్ ప్రతులను దహనం చేసి నిరసన తెలియ జేశారు.
టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ధ్వజం
జీవో ప్రతుల దహనం
ఒంగోలు(కార్పొరేషన్), జూన్ 22 : జగన్రెడ్డి ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగు తోందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎ న్ఎస్ఎఫ్) నాయకులు విమర్శించారు. ఈ సంద ర్భంగా మంగళవారం ఒంగోలులోని టీడీపీ కార్యా లయంలో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలె ండర్ ప్రతులను దహనం చేసి నిరసన తెలియ జేశారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ ఒంగోలు పార్ల మెంట్ అధ్యక్షుడు టి.రవితేజ మాట్లాడుతూ వైసీ పీ ప్రభుత్వం బూటకపు జీవోలను విడుదల చే స్తూ నిరుద్యోగులను మోసం చేస్తోందన్నారు. ఎన్ని కలకు ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనిచెప్పారని, అయితే అధికారం లోకి వచ్చి రెండేళ్లు అయినా పట్టించుకోలేదని వి మర్శించారు. ప్రభుత్వం ఈ ఏడాది జాబ్ క్యాలెం డర్తో గొప్పలు చెప్పుకుంటున్నారని, గడిచిపోయి న రెండేళ్ల క్యాలెండర్ ఏదని ప్రశ్నించారు. ఉపా ధ్యక్షుడు మంచు లలిత్కుమార్ మాట్లాడుతూ వ లంటీర్ వ్యవస్థను కూడా జాబ్ క్యాలెండర్లో చూ పి లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పు కోవడం సిగ్గు చేటన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకా రం వలంటీర్లకు కనీస వేతనం రూ.15వేలు ఇవ్వా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు పూసపాటి ఆంజనేయులు, ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు నవూరి కుమార్, య శ్వంత్, అలుగుపల్లి శివకృష్ణ పాల్గొన్నారు.