రైతుల ఉద్యమంపై దుష్ప్రచారాన్ని మానుకోవాలి
ABN , First Publish Date - 2021-02-06T05:30:00+05:30 IST
ఢిల్లీ సరిహదు ్దల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతు లపై కేంద్రం చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకో వాలని ఏఐకెఎస్సీసీ జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు హితవు పలికారు.

ఏఐకెఎస్సీసీ జిల్లా కన్వీనర్ చుండూరి
ఒంగోలు(జడ్పీ), ఫిబ్రవరి 6: ఢిల్లీ సరిహదు ్దల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతు లపై కేంద్రం చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకో వాలని ఏఐకెఎస్సీసీ జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు హితవు పలికారు. శనివారం ఒంగో లులోని ఆర్టీసీబస్టాండ్ ఎదురురోడ్డులో సంఘం ఆధ్వర్యంలో చక్కాజామ్ (రోడ్రోకో) చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పెంట్యాల హనుమంతురావు మాట్లాడుతూ కేం ద్రం ప్రతిపాదించిన విద్యుత్బిల్లు--2020 రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని, తక్షణ మే దానిని ఉపసంహరించుకోవాలని డిమండ్ చేశారు. కాగా బస్టాండ్ సెంటర్లో ఉదయం 11 గంటల సమయంలో చక్కాజామ్కు నాయకులు ఉపక్రమించారు. ఈ సమయంలో అటుగా వెళు తున్న ద్విచక్రవాహనదారుడు తనకు దారి ఇవ్వా లని వారితో వాగ్వాదానికి దిగాడు. అతనికి నచ్చ జెప్పి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వ డ్డే హనుమారెడ్డి, లలితకుమారి, చావలి సుధాక రరావు, చుంచు శేషయ్య, ఉప్పుటూరి ప్రకాశరా వు, పీవీఆర్.చౌదరి, వల్లంరెడ్డి రాజగోపాల్రెడ్డి త దితరులు పాల్గొన్నారు.