రైతుల ఉద్యమంపై దుష్ప్రచారాన్ని మానుకోవాలి

ABN , First Publish Date - 2021-02-06T05:30:00+05:30 IST

ఢిల్లీ సరిహదు ్దల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతు లపై కేంద్రం చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకో వాలని ఏఐకెఎస్‌సీసీ జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు హితవు పలికారు.

రైతుల ఉద్యమంపై దుష్ప్రచారాన్ని మానుకోవాలి
ఆర్టీసీ బస్టాండు సమీపంలో రోడ్డురోకో చేస్తున్న రైతు సంఘాల నాయకులు

ఏఐకెఎస్‌సీసీ జిల్లా కన్వీనర్‌ చుండూరి


ఒంగోలు(జడ్పీ), ఫిబ్రవరి 6: ఢిల్లీ సరిహదు ్దల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతు లపై కేంద్రం చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకో వాలని ఏఐకెఎస్‌సీసీ జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు హితవు పలికారు. శనివారం ఒంగో లులోని ఆర్టీసీబస్టాండ్‌ ఎదురురోడ్డులో సంఘం ఆధ్వర్యంలో చక్కాజామ్‌ (రోడ్‌రోకో) చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పెంట్యాల హనుమంతురావు మాట్లాడుతూ కేం ద్రం ప్రతిపాదించిన విద్యుత్‌బిల్లు--2020 రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని, తక్షణ మే దానిని ఉపసంహరించుకోవాలని డిమండ్‌ చేశారు. కాగా బస్టాండ్‌ సెంటర్‌లో ఉదయం 11 గంటల సమయంలో చక్కాజామ్‌కు నాయకులు ఉపక్రమించారు. ఈ సమయంలో అటుగా వెళు తున్న ద్విచక్రవాహనదారుడు తనకు దారి ఇవ్వా లని వారితో వాగ్వాదానికి దిగాడు. అతనికి నచ్చ జెప్పి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వ డ్డే హనుమారెడ్డి, లలితకుమారి, చావలి సుధాక రరావు, చుంచు శేషయ్య, ఉప్పుటూరి ప్రకాశరా వు, పీవీఆర్‌.చౌదరి, వల్లంరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త దితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-06T05:30:00+05:30 IST