విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి
ABN , First Publish Date - 2021-02-25T04:06:53+05:30 IST
విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని గౌతమి విద్యా సంస్థల చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి అన్నారు.
మార్కాపురం (వన్టౌన్) ఫిబ్రవరి 24: విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని గౌతమి విద్యా సంస్థల చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి అన్నారు. స్థా నిక శ్రీ గౌతమీ జూనియర్ కళాశాలలో ప్రెషర్స్ డే వే డుకలు ప్రిన్సిపాల్ ఎస్వీ సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. గుండారెడ్డి మాట్లాడుతు విద్యార్థులు దురలవాట్లకు లోను కా కుండా చదువుపై దృష్టి సారించాలన్నారు. చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్, క్రీడల్లో రాణించాలని అప్పుడే ఉపాధి అవకాశాలు అందివస్తాయని తెలిపారు. అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ బి.రామకృష్ణ, ఇన్చార్జి కె.శ్రీరాంరెడ్డి, గౌతమి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, అధ్యాపకులు మార్తాల బాలకృష్ణారెడ్డి, వై.రామిరెడ్డి, ఉపాధ్యాయులు ఏలియా, కె.వెంకటేశ్వరరెడ్డి, భాస్కర్ శర్మ, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.