తండ్రి హత్య కేసులో కుమారుడి అరెస్టు
ABN , First Publish Date - 2021-06-18T06:03:11+05:30 IST
కన్నతండ్రిని దారుణంగా కొట్టి చంపిన కేసులో కొడుకును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీసు సబ్డివిజన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కె.ప్రకాశరావు ఆ కేసు వివరాలను వెల్లడించారు.
దర్శి, జూన్ 17 : కన్నతండ్రిని దారుణంగా కొట్టి చంపిన కేసులో కొడుకును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీసు సబ్డివిజన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కె.ప్రకాశరావు ఆ కేసు వివరాలను వెల్లడించారు. దర్శి మండలం, తిమ్మాయిపాలేనికి చెందిన ఎం.అమృతరావు(75)ను అతని మూడో కుమారుడైన ఎం.సురేష్ ఈనెల 12న రోకలిబండతో ముహంపై దారుణంగా కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. తన భార్య మేరమ్మ మృతికి, తాను జైలుపాలు కావడానికి తండ్రే కారణమని సురేష్ అక్కసు పెంచుకొని తరచూ గొడవపడుతుండేవాడు. అదే క్రమంలో ఈ నెల 12న నిందితుడు సురేష్ మద్యం సేవించి రోకలిబండతో తలపై కొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో నిందితుడు అంగీకరించినట్లు డీఎస్పీ వివరించారు.