రేషన్ బియ్యం పం పిణీ ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-02T04:54:06+05:30 IST
ప్రజల ఇంటి వద్దకే రేషన్ బియ్యంను పం పిణీ చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.శేషిరెడ్డి తెలిపా రు.

మార్కాపురం (వన్టౌన్) ఫిబ్రవరి 1: ప్రజల ఇంటి వద్దకే రేషన్ బియ్యంను పం పిణీ చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.శేషిరెడ్డి తెలిపా రు. స్థానిక తోటవారి వీధిలో ఇంటింటికీ రేష న్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషిరెడ్డి మాట్లాడుతు ప్రజల విలువైన సమయం వృధా కాకుండా రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూలో ని ల్చోకుండా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలి పారు. మార్కాపురం పట్టణ పరిధిలో 33 రేషన్ షాపుల నుండి కార్డుదారులకు స రు కులు పంపిణీ చేయడానికి 9 మొబైల్ యూనిట్లు చేయటం జరిగిందన్నారు. కార్యక్ర మంలో మున్సిపల్ కమీషనర్ న యీం అహ్మద్, తహసీల్ధార్ విద్యాసాగరుడు, పౌర సరఫరాల శాఖ డీటీ భట్టు తదితరులు పాల్గొన్నారు.
గిద్దలూరుటౌన్లో..
గిద్దలూరు టౌన్ : ఇంటింటికీ రేషన్ బియ్యం పథకాన్ని సోమవారం ప ట్టణంలో తహసీల్దార్ రా జా రమేష్ ప్రేమ్కుమా ర్ ప్రారంభించారు. ప్రతి ఇంటి వద్దకు వాహనం వెళ్లి కార్డుదారులకు నా ణ్యమైన బియ్యం అం దించే పథకానికి శ్రీకారం చుట్టగా ఎన్నికల దృష్ట్యా పట్టణ ప్రాంతంలో మాత్రమే అనుమతి ఇచ్చారు. కార్డులోని ప్రతి వ్యక్తి 5 కిలోల నా ణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేశారు. 5 వాహనాలను సమకూర్చి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డీటీ చంద్రశేఖర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గంగిరెడ్డి, వీఆర్వోలు రంగయ్య, ఫరీద పాల్గొన్నారు.