దాతల చొరవతోనే రావినూతల హైస్కూలు అభివృద్ధి
ABN , First Publish Date - 2021-01-27T06:00:04+05:30 IST
దాతల చొరవతోనే రావినూతల జడ్పీ హై స్కూలు అభివృద్ధి సాధ్య మైందని డాక్డర్ ఈడ్పు గంటి హృదయనాథ్ పే ర్కొన్నారు. మంగళవారం స్థానిక హైస్కూల్లో ఎన్ ఆర్ఐ కొడవళ్ల హనుమం తరావు అందించిన రూ.3లక్షల విరాళంతో ఆధునికరించిన సైన్స్ ప్రయోగ శాలను ఆయన ప్రారంభించారు.
మేదరమెట్ల, జనవరి 26 : దాతల చొరవతోనే రావినూతల జడ్పీ హై స్కూలు అభివృద్ధి సాధ్య మైందని డాక్డర్ ఈడ్పు గంటి హృదయనాథ్ పే ర్కొన్నారు. మంగళవారం స్థానిక హైస్కూల్లో ఎన్ ఆర్ఐ కొడవళ్ల హనుమం తరావు అందించిన రూ.3లక్షల విరాళంతో ఆధునికరించిన సైన్స్ ప్రయోగ శాలను ఆయన ప్రారంభించారు. డిజిటల్ ప్రొజెక్టర్ను పాలేరు రమేష్బాబు బహూకరించగా, ఆయన తల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. కెనడాలో వై ద్యుడైన రావినూతల శ్రీనివాస్ రూ.1.52లక్షల ఖర్చుతో నిర్మించిన ఓపెన్ డ యాస్ను పేరెంట్స్ కమిటీ చైర్మన్ దామా హరిబాబు ప్రారంభించారు. కా ర్యక్రమంలో హెచ్ఎం ఎన్.సురేంద్రబాబు, గౌతమ్ రూరల్ సొసైటీ సభ్యు లు, మాజీ జిల్లా విద్యాధికారి మోపర్తి వెంకటరావు, కారుసాల బ్రహానందం, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.