సకాలంలో సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-10-29T06:03:39+05:30 IST
ప్రజ లకు సచివాలయ ఉ ద్యోగులు సకాలంలో ప నులు చేసి ప్రభుత్వాని కి మంచిపేరు తీసుకు రావాలని సచివాలయ ఉద్యోగులను ఎంపీపీ డి.కిరణ్గౌడ్ కోరారు.
ఎర్రగొండపాలెం, అ క్టోబరు 28: : ప్రజ లకు సచివాలయ ఉ ద్యోగులు సకాలంలో ప నులు చేసి ప్రభుత్వాని కి మంచిపేరు తీసుకు రావాలని సచివాలయ ఉద్యోగులను ఎంపీపీ డి.కిరణ్గౌడ్ కోరారు. కా శికుంటతాండా, మురారిపల్లె గ్రామసచివాలయాలను డీఎల్డీవో సా యికుమార్, జడ్పీటీసీ విజయభాస్కర్తో కలసి పర్యవేక్షించారు. ఈ సం దర్భంగా రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో హరిబాబ్నాయక్, లక్ష్మానాయక్, కార్యదర్శి పాల్గొన్నారు.
త్రిపురాంతకంలో..
త్రిపురాంతకం, మండలంలోని విశ్వనాఽథపురం, లేళ్లపల్లి, మిట్టపాలెం గ్రామ సచివాలయాలను తహసీల్దార్ వి.కిరణ్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. సంక్షేమ పథ కాల అమలుతీరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, అర్జీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో పీఎస్, సచివాలయ సిబ్బంది, వలంటరీలు పాల్గొన్నారు.