ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2021-12-08T15:35:39+05:30 IST
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీనివాసాచారి, రాజ్యలక్ష్మితో పాటు కారు డ్రైవర్గా గుర్తించారు. గుడివాడ నుండి తిరుపతి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.