నీట్లో రాష్ట్ర స్థాయి ప్రతిభ
ABN , First Publish Date - 2021-11-24T05:22:04+05:30 IST
శ్రీ సాధన కళాశాలకు చెందిన షేక్ షాజిదా నీట్ ఫలితాలలో 2010 ర్యాంక్ను సాధించిందని ప్రిన్సిపాల్ జి.అమరేందర్ రెడ్డి మంగళవారం తెలిపారు.
![నీట్లో రాష్ట్ర స్థాయి ప్రతిభ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మార్కాపురం(వన్టౌన్), నవంబరు 23: శ్రీ సాధన కళాశాలకు చెందిన షేక్ షాజిదా నీట్ ఫలితాలలో 2010 ర్యాంక్ను సాధించిందని ప్రిన్సిపాల్ జి.అమరేందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా షాజిదాను కళాశాల డైరెక్టర్లు ప్రసా ద్, రాజగోపాల్రెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్బాబు, అధ్యాపకులు అభినందించారు.
జ్ఞానశ్రీ నీట్ అకాడమీ విద్యార్థులు నీట్-2021 ఫలితాలలో ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ జి.శేషికుమార్ 3158, ఈ.శ్రావణి 3890, డి.వర్షిణి 4996, షేక్ రిహానా 5741, ఆర్.మహిత 11933, పి.జగదీష్ 6350 ర్యాంకులు సాధించారని పరీక్ష రాసిన 6 మందిలో నలుగురు ఎంబీబీఎస్, ఇద్దరు బీడిఎస్ సీట్లు సాధించగల ర్యాంకులు వచ్చాయని మల్లికార్జున తెలిపారు.