అండర్-19లో నధీర్కు గోల్డ్మెడల్
ABN , First Publish Date - 2021-12-01T04:57:29+05:30 IST
యూత్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వ ర్యంలో నవంబరు 27, 28 తేదీలలో గోవాలో జ రిగిన అండర్-19 అథ్లెటిక్స్లో కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన షేక్ నదీర్ గోల్డ్మెడల్ సాధించారు.
కంభం, నవంబరు 30 : యూత్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వ ర్యంలో నవంబరు 27, 28 తేదీలలో గోవాలో జ రిగిన అండర్-19 అథ్లెటిక్స్లో కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన షేక్ నదీర్ గోల్డ్మెడల్ సాధించారు. 100 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ చూపి మొదటి స్థానంలో నిలి చాడు. 1600 మీటర్లలో మొదటి స్థానం, 4400 రిలేలో మొదటి స్థానం పొంది గోల్డ్మెడల్, ప్రశంసాపత్రం సాధించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. జనవరిలో ఇండో నేపాల్లో జరిగే ఇంటర్నేషనల్ పోటీల్లో నధీర్ పొల్గొనేందుకు అర్హత సాధించాడని తెలిపారు. ఈసందర్భంగా షేక్ నధీర్ను పలువురు అభినందించారు.