ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ ఉండాలి

ABN , First Publish Date - 2021-05-08T07:33:28+05:30 IST

కరోనా చికిత్స చేస్తున్న ప్రైవేటు హాస్పటల్స్‌లో అధిక ఫీజులు వసూలు చేయకుండా, బాధితులకు మెరుగ్గా వైద్యసేవలు అందించేలా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి కోరారు.

ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ  ఉండాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర రెడ్డి

కందుకూరు, మే 7: కరోనా చికిత్స చేస్తున్న ప్రైవేటు హాస్పటల్స్‌లో అధిక ఫీజులు వసూలు చేయకుండా, బాధితులకు మెరుగ్గా వైద్యసేవలు అందించేలా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి కోరారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు హాస్పటల్స్‌లో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉందని, తక్షణం పరిస్థితిని చక్కదిద్దుకుని వారు మెరుగైన సేవలు అందించేలా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవటంపై జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారితో మాట్లాడిన ఎమ్మెల్యే తక్షణం పరిస్థితిని చక్కదిద్దాలని, తగినన్ని మందులు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. శనివారం నుంచి మందుల దుకాణాలు, పాల బూత్‌లకు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉన్నందున వీధులలో ఏ ఒక్కరు కనిపించినా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో తహసీల్దార్‌ డి.సీతారామయ్యతో పాటు సీఐ విజయకుమార్‌, డాక్టరు ఇంద్రాణి, ఎంపీడీవో విజయశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. మనోహర్‌, ఎస్‌ఐలు తిరుపతిరావు, కె. అంకమ్మ, ఏడీఏ ఎం. శేషగిరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T07:33:28+05:30 IST