మున్నాగ్యాంగ్పై నేర నిరూపణ
ABN , First Publish Date - 2021-05-19T05:09:46+05:30 IST
హైవే కిల్లర్గా ముద్రపడ్డ మున్నా బాయ్గ్యాంగ్పై 2008లో నమోదైన నాలుగు కేసులలో నేరం నిరూపణ అయింది. మంగళవారం న్యాయమూర్తి 18 మంది నిందితులను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.
![మున్నాగ్యాంగ్పై నేర నిరూపణ](https://media.andhrajyothy.com/appimg/galleries/192105181138458/05182021233916n61.gif)
18 మందికి జ్యుడిషియల్ కస్టడీ
ఒంగోలు(క్రైం), మే 18 : హైవే కిల్లర్గా ముద్రపడ్డ మున్నా బాయ్గ్యాంగ్పై 2008లో నమోదైన నాలుగు కేసులలో నేరం నిరూపణ అయింది. మంగళవారం న్యాయమూర్తి 18 మంది నిందితులను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. మద్దిపాడులో 2 కేసులు, సింగరాయకొండ ఒక కేసు సీఐడీ విచారిస్తున్న మరో కేసులో వారిని నేరస్థులుగా గుర్తించారు. ఈనెల 20వ తేదీన శిక్షలు విధిస్తామని వారు పేర్కొన్నారు. అప్పటికే కొందరు రిమాండ్లో ఉండగా, మరికొంత మంది బెయిల్పై ఉన్నారు.