దివ్యాంగుల అభ్యున్నతికి మరిన్ని సేవలు
ABN , First Publish Date - 2021-10-29T06:05:10+05:30 IST
దివ్యాంగుల అభ్యున్నతికి కోసం ఆర్డీటీ సంస్థ మరిన్ని సేవలందించనుందని సంస్థ ఎస్టీఎల్ కుమార్ అన్నారు.

పెద్ద దోర్నాల, అక్టోబరు 28 : దివ్యాంగుల అభ్యున్నతికి కోసం ఆర్డీటీ సంస్థ మరిన్ని సేవలందించనుందని సంస్థ ఎస్టీఎల్ కుమార్ అన్నారు.మండలంలోని చిన్నగుడిపాడు వద్ద ఉన్న ఆర్డీటీ సంస్థ కార్యాలయంలో 16 మంది దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో దివ్యాంగులను గుర్తించి వారిని సంఘాలుగా ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా దివ్యాంగ చిన్నారుల భవిష్యత్ కోసం, వారికి విద్య, వైద్యం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో కార్యాలయం ఆవరణలోనే ప్రత్యేక పాఠశాల, వైద్యశాలను నిర్మిస్తున్నట్లు కుమార్ చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది శ్రీనివాస్, రమణ, శ్రీను, అల్లిబాషా, షాహిద్, అలీ పాల్గొన్నారు.