మహాపంచాయత్‌ను జయప్రదం చేద్దాం

ABN , First Publish Date - 2021-04-18T06:04:29+05:30 IST

ఒంగోలులో ఈనెల 19న జరిగే మహా పంచాయత్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత రైతుసంఘాల సమన్వయ కమిటీ మండలశాఖ పిలుపునిచ్చింది.

మహాపంచాయత్‌ను జయప్రదం చేద్దాం


మేదరమెట్ల, ఏప్రిల్‌ 17: ఒంగోలులో ఈనెల 19న జరిగే మహా పంచాయత్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత రైతుసంఘాల సమన్వయ కమిటీ మండలశాఖ పిలుపునిచ్చింది. శనివారం సాయంత్రం మేదరమెట్లలో సమావేశమైన కమిటీ సభ్యులు సాగుచట్టాల రద్దుకు రైతులందరూ కలిసి పోరాడాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులో గత నాలుగు నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలపాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాకేష్‌సింగ్‌ తికాయత్‌ తదితర రైతు నాయకులతో ఒంగోలులో ఏర్పాటుచేసిన సమావేశానికి రైతులందరూ హాజరై మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మోండ్రు ఆంజనేయులు, నాతాని హనుమంతరావు, చెన్నుపాటి హరిబాబు, మన్నె దుర్గారావు, కరిచేటి రాంబాబు, వెంకట్రావు, ముమ్మన నరసింహారావు  పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:04:29+05:30 IST