భక్తిశ్రద్ధలతో కూడరై పాశురం
ABN , First Publish Date - 2021-01-12T04:58:07+05:30 IST
ధనుర్మాసం సం దర్భంగా మార్కాపురంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో కూడరై పాశు రంను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
మార్కాపురం (వన్టౌన్), జనవరి 11 : ధనుర్మాసం సం దర్భంగా మార్కాపురంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో కూడరై పాశు రంను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు నంద్యాల తిరుమాలచార్యులు, శ్రీపతి అప్పనా చా ర్యులు చెన్నకేశవస్వామి, రాజ్య లక్ష్మి అమ్మవార్ల మూల విరా ట్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. మధ్య రంగ మండపంలో గోదాదేవిని వివిధ పుష్ప మాలలు, పట్టు వ స్త్రాలు, ఆభరణాలతో అలంకరించారు. చెన్నకేశవ స్వామికి 108 గంగాళాల పాయసం సమర్పించారు. గుండ్లకమ్మ నదీ తీరాన ఉన్న శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆల యంలో గోదాదేవికి పూజలు, కూడరై పాశురం నిర్వహించారు.
