కొమరోలు మాజీ జడ్పీటీసీ సతీమణి మృతి

ABN , First Publish Date - 2021-10-30T04:46:34+05:30 IST

కొమరోలు మాజీ జడ్పీటీసీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా రైతు కార్యదర్శి వీరంరెడ్డి వీర రాఘవరెడ్డి సతీమణి విజయమ్మ అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతిచెందారు. ఆమె గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కి మేనత్త. మృతి సమాచారం తెలుసుకున్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై ఆమెభౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

కొమరోలు మాజీ జడ్పీటీసీ సతీమణి మృతి
నివాళిఅర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కొమరోలు, అక్టోబరు 29 : కొమరోలు మాజీ జడ్పీటీసీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా రైతు కార్యదర్శి వీరంరెడ్డి వీర రాఘవరెడ్డి సతీమణి విజయమ్మ అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతిచెందారు. ఆమె గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కి మేనత్త.  మృతి సమాచారం తెలుసుకున్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై  ఆమెభౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అత్త విజయమ్మ మృతి విచారకరమని,  ఆమె ఆత్మకుశాంతి చేకురాలని ప్రార్ధించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-10-30T04:46:34+05:30 IST