జనాగ్రహ దీక్షకు అక్రమ విద్యుత్..!
ABN , First Publish Date - 2021-10-22T05:21:20+05:30 IST
ఒంగోలులోని క లెక్టరేట్ వద్ద గురువారం వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనాగ్రహదీక్షకు అక్రమంగా విద్యుత్ వాడుకునేందుకు ప్ర యత్నించారు. అయితే ఈ విషయం వైరల్ కావడంతో వైసీ పీ నాయకులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు.
కలెక్టరేట్ నుంచి కరెంటు వాడుకునేందుకు నాయకుల యత్నం
అనంతరం జనరేటర్ ఏర్పాటు
ఒంగోలు(కలెక్టరేట్), అక్టోబరు 21 : ఒంగోలులోని క లెక్టరేట్ వద్ద గురువారం వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనాగ్రహదీక్షకు అక్రమంగా విద్యుత్ వాడుకునేందుకు ప్ర యత్నించారు. అయితే ఈ విషయం వైరల్ కావడంతో వైసీ పీ నాయకులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. అంతకుముందు సుమారు దీక్ష శిబిరానికి గంటకుపైగా అక్ర మంగా విద్యుత్ వాడుకున్నారు. ఈ విషయంపై విస్తృత చ ర్చ జరుగుతున్న సమయంలో కొంతమంది ఫొటోలు కూడా తీసి సామాజిక మాద్యమాల్లో పంచుకున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు వెంటనే విద్యుత్ కనెక్షన్ను తొలగించి అ ప్పటికప్పుడు జనరేటర్ను తెప్పించి వినియోగించుకున్నారు.