జనాగ్రహ దీక్షకు అక్రమ విద్యుత్‌..!

ABN , First Publish Date - 2021-10-22T05:21:20+05:30 IST

ఒంగోలులోని క లెక్టరేట్‌ వద్ద గురువారం వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనాగ్రహదీక్షకు అక్రమంగా విద్యుత్‌ వాడుకునేందుకు ప్ర యత్నించారు. అయితే ఈ విషయం వైరల్‌ కావడంతో వైసీ పీ నాయకులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు.

జనాగ్రహ దీక్షకు అక్రమ విద్యుత్‌..!
కలెక్టరేట్‌ నుంచి దీక్షా శిబిరానికి ఏర్పాటు చేసిన కరెంటు తీగలు

కలెక్టరేట్‌ నుంచి కరెంటు వాడుకునేందుకు నాయకుల యత్నం

అనంతరం జనరేటర్‌ ఏర్పాటు


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 21 : ఒంగోలులోని క లెక్టరేట్‌ వద్ద గురువారం వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనాగ్రహదీక్షకు అక్రమంగా విద్యుత్‌ వాడుకునేందుకు ప్ర యత్నించారు. అయితే ఈ విషయం వైరల్‌ కావడంతో వైసీ పీ నాయకులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. అంతకుముందు సుమారు దీక్ష శిబిరానికి గంటకుపైగా అక్ర మంగా విద్యుత్‌ వాడుకున్నారు. ఈ విషయంపై విస్తృత చ ర్చ జరుగుతున్న సమయంలో కొంతమంది ఫొటోలు కూడా తీసి సామాజిక మాద్యమాల్లో పంచుకున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు వెంటనే విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించి అ ప్పటికప్పుడు జనరేటర్‌ను తెప్పించి వినియోగించుకున్నారు.  


Updated Date - 2021-10-22T05:21:20+05:30 IST