చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , First Publish Date - 2021-10-21T06:03:49+05:30 IST
విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంఈవో పి.ఆంజనేయులు తెలిపారు.

ఎర్రగొండపాలెం, అక్టోబరు 20: విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంఈవో పి.ఆంజనేయులు తెలిపారు. చేతుల శుభ్రతపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్లోబల్ చేతులు పరిశుభ్రం దినోత్సవం సందర్భంగా మా ట్లాడుతూ భోజనం తినే ముందు, తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూ చిం చారు. అనంతరం పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లను ఎంఈవో పరి శీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని వండిపెట్టాలని ఎంఈ వో సూచిచారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశ్వర్లు, సీఆర్పీలు పాల్గొన్నారు.