గుర్రం జాషువాకు నివాళి
ABN , First Publish Date - 2021-07-25T06:09:48+05:30 IST
కవి గుర్రం జాషువా వర్ధంతిని బీసీ భవన్లో శనివారం నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మార్కాపురం(వన్టౌన్), జూలై 24: కవి గుర్రం జాషువా వర్ధంతిని బీసీ భవన్లో శనివారం నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర కార్యదర్శి పిన్నిక లక్ష్మీప్రసాద్, నాయకులు శ్రీనివాసులు, షేక్ పర్విన్, కృష్ణా, పృధ్వి, రంగ స్వామి పాల్గొన్నారు.
జాషువా విగ్రహం ఏర్పాటుకు చర్యలు
గిద్దలూరు టౌన్, జూలై 24 : పట్టణంలో గుర్రం జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీనియర్ న్యాయవాది కాటెపోగు రవిప్రకాశ్ అన్నారు. శనివారం జాషువా సేవాసమితి ఆధ్వ ర్యంలో జాషువా వర్ధంతిని నిర్వహించారు. ఈసందర్భంగా సమితి సభ్యు లు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సే వాసమితి సభ్యులు మాట్లాడుతూ చిన్నప్పుడు అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారని, అనేక కవితలు, కావ్యాలను రచించిన వ్యక్తి జాషువా అన్నారు. ఆయన విగ్రహాన్ని పట్టణంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సేవాసమితి అధ్యక్షులు గుర్రం బా బూరావు, దళిత నాయకులు కొండెపోగు దేవప్రభాకర్, గుర్రం డానియే లు, గుర్రం కిరణ్పాల్, దాసరి నాగయ్య, ఇసుకల మరియమ్మ, దాసరి సంతోషమ్మ పాల్గొన్నారు.