సచివాలయ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-01-16T05:11:34+05:30 IST
కందుకూరు మండలంలోని పలుకూరులో బూర్సు ఝాన్సీనాగరాణి(24) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
కందుకూరు, జనవరి 15 : మండలంలోని పలుకూరులో బూర్సు ఝాన్సీనాగరాణి(24) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గ్రామ సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఝాన్సీకి పలుకూరుకి చెందిన బూర్సు మాల్యాద్రితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈనెల 11న సాయంత్రం మాల్యాద్రి ఆమెను సచివాలయం నుంచి ఇంటికి తీసుకురాగా బాత్రూమ్కి వెళ్లిన ఝాన్సీ నాగరాణి ఎంతకూ బయటకు రాలేదు. తలుపు పగులగొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే స్థానిక ఆర్ఎంపీ వద్ద చూయించి అనంతరం కందుకూరు, ఆ తర్వాత ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఆ రోజు రాత్రి ఆమె మృతిచెందింది. మాల్యాద్రే ఝాన్సీ నాగరాణిపై అనుమానంతో ఉరేసి చంపే ప్రయత్నం చేసి కొన ఊపిరి ఉన్నప్పుడు హాస్పటల్కి తీసుకెళ్లాడని మృతురాలి బంధువు కుంచాల సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయిన ఝాన్సీనాగరాణిని ఆమె అమ్మమ్మ చదివించి పెళ్లి చేసిందని ఇంతలోనే ఆమె చనిపోవటం విషాదమని బంధువులు రోదించారు.