మనస్తాపంతో యువకుడు బలవన్మరణం

ABN , First Publish Date - 2021-09-02T06:04:29+05:30 IST

‘‘రెండు నెలల క్రి తం భార్య ఆత్మహత్య చేసుకుంది.. ఉన్న ఒక్క కొ డుకుని భార్య తరఫు బంధువులు చూపించడం లే దు.. ఇక నేను ఎందుకు బతకాలి’’ అంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణం చెందా డు. ఈ సంఘటన మండల పరిధిలోని తోటవారిపాలెం పంచాయతీ ఇందిరానగర్‌కాలనీలో బుధవా రం ఉదయం చోటుచేసుకుంది.

మనస్తాపంతో యువకుడు బలవన్మరణం
మృతి చెందిన వల్లిబాబు

రెండు నెలల క్రితం భార్య మృతి


చీరాలటౌన్‌, సెప్టెంబరు 1 : ‘‘రెండు నెలల క్రి తం భార్య ఆత్మహత్య చేసుకుంది.. ఉన్న ఒక్క కొ డుకుని భార్య తరఫు బంధువులు చూపించడం లే దు.. ఇక నేను ఎందుకు బతకాలి’’ అంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణం చెందా డు. ఈ సంఘటన మండల పరిధిలోని తోటవారిపాలెం పంచాయతీ ఇందిరానగర్‌కాలనీలో బుధవా రం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... నాయుడు వల్లిబాబు(24)కు ఒంగోలుకు చెందిన మనీషా(21)కు సుమారు మూడేళ్ల క్రితం వివాహమైంది. అతను బేలుదారీ పనిచేస్తుంటాడు. వీరికి రెండేళ్ల వయసు బాబు ఉన్నాడు. కొంతకాలం గా భర్త ప్రవర్తనపై అనుమానం చెందిన భార్య త రచూ గొడవపడేది. ఈ నేపథ్యంలోనే రెండు నెలలు క్రితం పురుగుల మందు తాగి మనీషా మృతిచెందింది. వల్లిబాబుతో భార్య కుటుంబ సభ్యులు గొడవపడి పెద్దల సమక్షంలో కుమారుడిని పది రోజు లు అమ్మమ్మ వద్ద, పది రోజులు తండ్రి వద్ద ఉంచే లా ఒప్పందం కుదుర్చుకున్నారు. భార్య చనిపోయి న నాటినుంచి భార్య తరఫు బంధువులు కుమారు డ్ని చూపించడం లేదు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసగా మారిన వల్లిబాబు బుధవారం ఉదయం సుమారు 6 గంట ల సమయంలో కాలనీ శివారులో తాడిచెట్టుకు తా డు, ఒంటిపై ఉన్న లుంగీతో ఉరివేసుకుని మృతిచెందా డు. సమాచారం అందుకున్న ఈ పూరుపాలెం ఎ స్సై సూరేపల్లి సు బ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


కొడుకుని చూపని కారణంగానే.. 


భార్య చనిపోయిన నాటినుంచి మనోధైర్యాన్ని కోల్పోయాడు. ఉన్న కొడుకుని ఒప్పందంపై తీసుకువెళ్లి చూపించడం మానేశారు. ఒకవైపు భార్య మృ తి మరో వైపు కుమారుడి ఆచూకీ లేకపోవడంతోనే నా కుమారుడు మృతిచెందాడు. ఘటనపై అధికారులు విచారణ జరిపాలి.

- మృతుడి తల్లి రమాదేవి


Updated Date - 2021-09-02T06:04:29+05:30 IST