ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు అందాలి

ABN , First Publish Date - 2021-10-08T05:29:24+05:30 IST

సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయసేవలు అందాలన్న లక్ష్యంతోనే ఆజాదిక అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని విశ్వభారతి పాఠశాల కరస్పాండెంట్‌ జి.ఆదిలక్ష్మి అన్నారు.

ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు అందాలి
మాట్లాడుతున్న పాఠశాల కరస్పాండెంట్‌ ఆదిలక్ష్మి


గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 7 : సమాజంలోని ప్రతి వర్గానికీ న్యాయసేవలు  అందాలన్న లక్ష్యంతోనే  ఆజాదిక అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని విశ్వభారతి పాఠశాల కరస్పాండెంట్‌ జి.ఆదిలక్ష్మి అన్నారు. గురువారం పాఠశాలలో ఆజాదిక అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. సమావేశంలో న్యాయవాది మల్లికార్జునరావు మాట్లాడుతూ న్యాయసేవల విషయాలలో బీద, ధనిక, కుల, మత, ప్రాంత వివక్ష ఉండకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయసహాయంతోపాటు కోర్టు ఫీజు మినహాయింపు ఇవ్వ డం జరుగుతుందన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు చదువుతోపాటు న్యాయచట్టాలపైన సమాజంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది సిద్దయ్య, ఉపాధ్యాయుడు నారాయణ, పారా లీగల్‌ వలంటీర్‌ మధుసూదన్‌రావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-08T05:29:24+05:30 IST