డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-01-13T06:04:29+05:30 IST
కంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చేరే విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరం నుంచి తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ప్రవేశం పొందాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
![డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కంభం, జనవరి 12 : కంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చేరే విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరం నుంచి తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ప్రవేశం పొందాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో ఈనెల 6వ తేదీ నుంచి 17వ తేది వరకు మాత్రమే ప్రవేశం పొందడానికి గడువు ఉందన్నారు. ఆన్లైన్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు మాత్రమే స్కాలర్షి్పలు మంజూరవుతాయని తెలిపారు. బీఏ, బీకాం, బీఎ్ససీ (బీజడ్సీ), బీఎస్సీ (ఎంపీసీ) కోర్సులు ఉన్నాయన్నారు. వివరాలకు 9989395169 సంప్రదించాలని కోరారు.