ఖోఖో జాతీయ స్థాయి కోచ్గా జిల్లావాసి
ABN , First Publish Date - 2021-01-20T06:41:59+05:30 IST
జాతీయ స్థాయి ఖోఖో కోచ్గా జిల్లాకు చెందిన ఆవులయ్య నియమితులయ్యారు.

ఆవులయ్య నియామకం
జాతీయ స్థాయి శిక్షణకు పంగులూరు అకాడమీకి చెందిన ముగ్గురు ఎంపిక
పంగులూరు, జనవరి 19 : జాతీయ స్థాయి ఖోఖో కోచ్గా జిల్లాకు చెందిన ఆవులయ్య నియమితులయ్యారు. జాతీయ స్థాయిలో శిక్షణకు పి.శివారెడ్డి, ఎ.శివనాగిరెడ్డి, ఎన్.అజయ్ ఎంపికయ్యారు. వీరిలో ఆవులయ్య ఎన్ఐఎస్ ఖోఖో కోచ్గా సేవలందించారు. పంగులూరులోని ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ సబ్ సెంటర్లో 2017 నుంచి 2019 వరకూ కోచ్గా పని చేశారు. పంగులూరు అకాడమీలో శిక్షణ పొందిన పి.శివారెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారు. శివనాగిరెడ్డి, నాయుడు అజయ్ కూడా పంగులూరు ఖోఖో అకాడమీలో శిక్షణ పొందుతూ అనేక పోటీల్లో సత్తా చాటారు. వీరు ఫిట్నెస్ క్యాంపునకు ఎంపికావడంపై ఖోఖో అసోషియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ గరటయ్య, కార్యదర్శి, ఏకేఎఫ్ఐ కోశాధికారి ఎం.సీతారామిరెడ్డి, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కుర్రా భాస్కరరావు, కాశీవిశ్వనాథరెడ్డి అభినందనలు తెలిపారు.