ప్రశాంతంగా డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-09-29T06:41:44+05:30 IST

జిల్లాలోని సచివాలయ సిబ్బందికి మంగళవారం నుంచి డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ప్రశాంతంగా డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు
ఆన్‌లైన్‌లో పరీక్ష రాస్తున్న సచివాలయ సిబ్బంది

జిల్లాలోని  నాలుగు కేంద్రాల్లో నిర్వహణ

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 28: జిల్లాలోని సచివాలయ సిబ్బందికి మంగళవారం నుంచి డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 4,496మంది సచివాలయ ఉద్యోగులు ఈ మూడు రోజులపాటు డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాయనుండగా అందుకోసం నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజైన మంగళవారం మూడు షిఫ్టుల్లో డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు జరగ్గా 2,501మందికిగాను 2,478 మంది హాజరయ్యారు.











Updated Date - 2021-09-29T06:41:44+05:30 IST