నేర పరిశోధనపై దృష్టి పెట్టాలి

ABN , First Publish Date - 2021-06-21T05:59:08+05:30 IST

పోలీస్‌ అధికారులు, జియోలు (జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు) నేర పరిశోధన పై దృష్టి పెట్టాలని జిల్లా అద నపు ఎస్పీ రవిచంద్ర అన్నా రు.

నేర పరిశోధనపై దృష్టి పెట్టాలి

 ఏఎస్పీ రవిచంద్ర

మార్కాపురం, జూన్‌ 20: పోలీస్‌ అధికారులు, జియోలు (జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు) నేర పరిశోధన పై దృష్టి పెట్టాలని జిల్లా అద నపు ఎస్పీ రవిచంద్ర అన్నా రు. స్థానిక కిట్స్‌ కళాశాలలో మార్కాపురం, వై.పాలెం సర్కి ళ్ల పరిధిలోని ఎస్సైలు, జియో లకు ఆదివారం నేర పరిశోధనపై అవగాహన కల్పించారు. దొంగతనాలు జరిగినప్పుడు ఆధారాల సేకరణ, దర్యాప్తు విధానం, నేరస్తుల కదలి కలు తదితర అంశాలను వివరించా రు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పు డు దర్యాప్తు, నిందితుల గుర్తింపు, నేర నిర్ధారణ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో వివరించారు. కొవిడ్‌ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటించా లన్నారు. కేసుల దర్యాప్తులో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పడు తీసుకోవా ల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్య క్రమంలో సీఐలు బీటీ నాయక్‌, దేవప్రభాకర్‌, ఎస్సైల్‌ కిశోర్‌, రామకృష్ణ, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T05:59:08+05:30 IST