ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
ABN , First Publish Date - 2021-10-14T05:33:10+05:30 IST
ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాల ని ఎస్పీ మలిక గర్గ్ ఆదేశించారు. బుధవారం సంతనూతలపాడు పో లీస్స్టేషన్ను తనిఖీ చేసి రికార్డుల ను, పెండింగ్ కేసులకు సంబంధిం చిన వివరాలను పరిశీలించారు.
![ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/192110141201299/10142021000302n36.jpg)
ఎస్పీ మలిక గర్గ్
సంతనూతలపాడు, అక్టోబరు 13: ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాల ని ఎస్పీ మలిక గర్గ్ ఆదేశించారు. బుధవారం సంతనూతలపాడు పో లీస్స్టేషన్ను తనిఖీ చేసి రికార్డుల ను, పెండింగ్ కేసులకు సంబంధిం చిన వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ది శ, 100 ఫోన్కాల్స్ పట్ల త్వరితగతిన స్పందించాలన్నారు. మహిళలు, చిన్నారుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని చె ప్పారు. స్టేషన్ పరిధిలోని దేవాలయాల విష యంలో రక్షక్కమిటీలతో తరచూ స మావేశాలు నిర్వహించాలని, సీసీ కె మెరాలు పని చేస్తున్నాయో లేదో గ మనించాలని సూచించారు. గ్రామా ల్లో నిత్యం పర్యటిస్తూ ఉండాలన్నారు. గంజాయి, గుట్కా, ఖైనీ అమ్మకాలను అరికట్టాలని, ఇసుక, మద్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని చెప్పా రు. మహిళలు, విద్యార్థులు దిశ యా ప్ను తమ సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బి.మరియ దాసు, ఒంగోలు డీఎస్పీ యు.నాగరా జు, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐ రాజారా వు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.