మొక్కలను పరిశీలించిన ఏపీడీ

ABN , First Publish Date - 2021-10-21T06:02:52+05:30 IST

మండలంలో పలు గ్రామాలలో బుధ వారం ఉపాధిహామి పధకంలో చేపట్టిన బ్లాక్‌పాంటేషన్‌, ఎవిన్యూ తదితర మొక్కలను ఏపీడీ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు.

మొక్కలను పరిశీలించిన  ఏపీడీ

కొనకనమిట్ల, అక్టోబరు 20 : మండలంలో పలు గ్రామాలలో బుధ వారం  ఉపాధిహామి పధకంలో చేపట్టిన బ్లాక్‌పాంటేషన్‌, ఎవిన్యూ తదితర మొక్కలను ఏపీడీ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. గరిమి నపెంట, పాతపాడు, చినారికట్ల గ్రామాలలో మొక్కలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకం వాటి ఎదు గుదలకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని,  ప్రతినెలా మొదటి వారంలో సర్వేవల్‌ క్యాప్చర్‌ కొట్టా లని క్షేత్రసహా య కులకు సూచించారు.  అంతే కాకుండా క్షేత్ర సహాయకులు ప్రతి నిత్యం పర్యవేక్షించాలని చెప్పారు. మొక్కలు పశు వుల బారినపడకుండా కంచె ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట ఏపీవో రవిబాబు, ఈసీ బసతుల్లా, టీఏలు, క్షేత్రసహాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T06:02:52+05:30 IST