అడవిరాజుపాలెం - అమ్మవారిపాలెం రోడ్డుకు మహర్ధశ
ABN , First Publish Date - 2021-10-01T05:28:18+05:30 IST
అడవిరాజుపాలెం - అమ్మవారిపాలెం రహదారికి మహర్ధశ కలుగుతుందని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి
గుడ్లూరు, సెప్టెంబరు 30: అడవిరాజుపాలెం - అమ్మవారిపాలెం రహదారికి మహర్ధశ కలుగుతుందని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడ్లూరు నుంచి అడవి రాజుపాలెం మీదిగా అమ్మవారిపాలెం వరకు రహదారి నిర్మాణం త్వర లో జరగనుందని తెలిపారు. పోట్లూరు - పాజర్ల రహదారిని కూడా త్వరలో మరమ్మతు చేయిస్తామని చెప్పారు. గ్రామాల్లో సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా చూడాలని వైద్య సిబ్బందికి చూచించారు. గుడ్లూ రులో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలన్నారు. అనంతరం గ్రామాల్లో పలు సమస్యలపై అర్జీలు రాగా, వాటిని పరిస్కరించాలని అధికారు లకు చూచించారు.
సమావేశానికి ఎంపీడీవో నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, వైద్య ఆరోగ్యకేంద్రం డాక్టర్ మారుతీరావు, ఎంపీపీ పులి రమేష్, వైస్ ఎంపీపీ మోరబోయిన శ్రీరాములు, గుడ్లూరు గ్రామ సర్పంచ్ పాలకీర్తి శంకర్, చెరుకూరి సూర్యనారాయణ, కాపులూరి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.