శుభ్రత పాటించకపోతే చర్యలు
ABN , First Publish Date - 2021-08-25T06:03:48+05:30 IST
ఆహార పదార్థాల తయారీ, అమ్మకాల్లో శుభ్రత పాటిం చకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నాయబ్ రసూల్ హెచ్చరించారు.

హోటళ్లలో శానిటరీ ఇన్స్పెక్టర్ తనిఖీలు
మార్కాపురం(వన్టౌన్), ఆగస్టు 24: ఆహార పదార్థాల తయారీ, అమ్మకాల్లో శుభ్రత పాటిం చకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నాయబ్ రసూల్ హెచ్చరించారు. మార్కాపురం పట్టణం లోని హోటళ్లు, రెస్టాంరెట్లు, బేకరీలు, తినుబం డారాల దుకాణాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో శుభ్రంగా ఉంచాలన్నారు. కరోనా నివారణలో భాగంగా సిబ్బంది మాస్కులు ధరించాలని వం టలు వండేటప్పుడు గ్లౌజులు, మాస్కులు తప్ప నిసరిగా ధరించాలని సూచించారు. షాపుల, హోటళ్ల యజమానులు తప్పనిసరిగా ట్రేడ్ లై సెన్స్లు తీసుకోవాలన్నారు. ఆహార పదార్థాలలో రంగులు వాడవద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిల్వ మాంసం, తినుబండారాలు ఫ్రిజ్లలో ఉంచరాదన్నారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శుభ్రతతో నిర్వ హించాలని రసూలు సూచించారు.