మెజార్టీ సభ్యుల ఆమోదంతోనే పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-10-30T04:33:31+05:30 IST

గ్రామ పంచాయతీల్లో మెజార్టీవార్డు సభ్యుల ఆమోదంతోనే సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టాలని పంచాయతీరాజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ శివశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

మెజార్టీ సభ్యుల ఆమోదంతోనే పనులు చేపట్టాలి
వార్డు సభ్యుల శిక్షణలో మాట్లాడుతున్న పంచాయతీరాజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ శివశంకర ప్రసాద్‌

పంచాయతీరాజ్‌శాఖ డీసీ శివశంకర ప్రసాద్‌ 

పెళ్లకూరు, అక్టోబరు 29 : గ్రామ పంచాయతీల్లో మెజార్టీవార్డు సభ్యుల ఆమోదంతోనే సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టాలని పంచాయతీరాజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ శివశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణకు శుక్రవారం ఆయన హాజరయ్యారు. వార్డు సభ్యులకు విధులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించారు. పంచాయతీలో వార్డు సభ్యులు మూలస్తంభాలాంటివారని, ఎంపీ, ఎమ్మెల్యే ఇతరత్రా నిధులను పంచాయతీల్లో ఖర్చుచేసేటప్పుడు ప్రతిపైసా దుర్వినియోగం కాకుండా వినియోగిం చాలన్నారు. సమావేశంలో  జడ్పీటీసీ నన్నం ప్రిస్కిల్లా , ఎంపీడీవో ఎ. ప్రమీలారాణి, ఈవోపీఆర్‌డీ జీ. వసంతకుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T04:33:31+05:30 IST