రేపు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-29T04:31:19+05:30 IST

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శనివా రం ఆత్మకూరులో నూతనంగా ఏర్పా టు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ను ప్రారంభిస్తారని మున్సిపల్‌

రేపు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం

ఆత్మకూరు, అక్టోబరు 28 : మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శనివా రం ఆత్మకూరులో నూతనంగా ఏర్పా టు చేసిన  మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ను ప్రారంభిస్తారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.వెంకటరమణమ్మ, కమిషనర్‌ ఎం రమే్‌షబాబు తెలిపారు. గురువా రం మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. సరికొత్త టెక్నాలజీతో ప్రజలకు సురక్షత మంచినీటిని సరఫరా చేసే దిశగా ఆదాని ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా ప్రతి ఇంటికి నేరుగా తక్కువ ధరకే మినరల్‌ వాటర్‌ను సరఫరా చేయడం జరుగుతందన్నారు. 20 లీటర్ల నీటిని రూ.5 లకే అందిస్తామన్నారు. సెల్‌ఫోన్‌ రీచార్జ్‌ తరహా లో ముందుగా డబ్బు చెల్లించి నీటిని పొందవలసి ఉంటుందన్నారు. ముందుగా వారు వాటర్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి, సిండికేట్‌ ఫార్మసీ కో ఆపరేటివ్‌ సొసైటీ ఛైర్మన్‌ నాగులపాటి ప్రతా్‌పరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ షేక్‌ సర్ధార్‌, పలువురు వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:31:19+05:30 IST