వీఎస్యూ రిజిస్ట్రార్ శ్రీసిటి సందర్శన
ABN , First Publish Date - 2021-12-16T03:23:36+05:30 IST
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి బుధవారం శ్రీసిటిని సందర్శించారు. యూనివర్సిటీ ఉపకులప

తడ, డిసెంబరు 15 : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి బుధవారం శ్రీసిటిని సందర్శించారు. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎం సుందరవళ్లి సూచనల మేరకు శ్రీసిటికి వచ్చిన రిజిస్టార్ శ్రీసిటి ఎండీ రవీంద్ర సన్నారెడ్డిని కలుసుకున్నారు. విద్యార్థులకు వివిధ పరిశ్రమలలోని ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించాలని రిజిస్ట్రార్ కోరారు. ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి సానుకూలంగా స్పందించారు.