ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , First Publish Date - 2021-04-13T05:12:34+05:30 IST
రాష్ట్రంలోని పంచాయతీరాజ్, ఎంపీడీవో ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు.
గూడూరురూరల్, ఏప్రిల్ 12: రాష్ట్రంలోని పంచాయతీరాజ్, ఎంపీడీవో ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులకు సముచితన్యాయం చేయాలన్న అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోల సంఘం రాష్ట్రాధ్యక్షుడు బ్రహ్మయ్య, జిల్లా నాయకులు శివయ్య, విజయ్కుమార్, శ్రీధర్చౌదరి, శ్రీహరి, రవి తదితరులు పాల్గొన్నారు.