చెంగాళమ్మను దర్శించుకున్న టీటీడీ జేఈవో
ABN , First Publish Date - 2021-01-22T05:11:23+05:30 IST
టీటీడీ జేఈవో సదా భార్గవి గురువారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్నారు.
సూళ్లూరుపేట, జనవరి 21 : టీటీడీ జేఈవో సదా భార్గవి గురువారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికి అమ్మణ్ణి దర్శనం చేయించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బైరి పార్థసారధిరెడ్డి, ఉన్నారు.