ఇందిరాగాంధీకి నివాళి
ABN , First Publish Date - 2021-11-01T03:51:22+05:30 IST
ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గూడూరు, అక్టోబరు 31: ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంటా శ్రీనివాసులురెడ్డి, పూల చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ కృషి చేశారన్నారు. ప్రధానమంత్రిగా ఎనలేని సేవలందించి ఐరన్లేడీగా పేరు తెచ్చుకున్నారన్నారు.