మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-02-02T04:19:36+05:30 IST

గూడూరు డివిజన్‌లో మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ తెలిపారు.

మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు
మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ

గూడూరు, ఫిబ్రవరి 1: గూడూరు డివిజన్‌లో మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ తెలిపారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై  నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు. అధికారుల నియామకం పూర్తయిందన్నారు. ప్రతి అధికారి తమ విఽధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-02T04:19:36+05:30 IST