భావితరాల కోసం పనిచేయండి
ABN , First Publish Date - 2021-10-28T05:10:40+05:30 IST
రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం నాయకులు కష్టపడి పనిచేయాలని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ సూచించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నెల్లూరు పార్లమెంటు, నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల మహిళా కమిటీలను ప్రకటించారు.
టీడీపీ నేత అజీజ్
పార్టీ మహిళా కమిటీల ప్రకటన
నెల్లూరు(వ్యవసాయం), అక్టోబరు 27 : రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం నాయకులు కష్టపడి పనిచేయాలని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ సూచించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నెల్లూరు పార్లమెంటు, నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల మహిళా కమిటీలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ పదవులు పొందితే పత్రికల్లో ఫొటోలు వస్తాయనే ఉద్దేశంతో కాకుండా ఒక సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని, పదవులు అలంకరణ కాదని, ప్రజా సమస్యలపై పోరాడాలని మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలో మహిళలకు సరైన రక్షణ లేని ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ కోసం పనిచేసేందుకు వచ్చిన ప్రతి మహిళకు పాదాభివందనమన్నారు. పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళలకు సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మన్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనూరాధ, టీడీపీ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి, పులిమి శైలజారెడ్డి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
కమిటీల అధ్యక్ష కార్యదర్శులు వీరే..
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం తెలుగు మహిళా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనబాక భూలక్ష్మి, కొమారి విజయమ్మను నియమించారు. అదే విధంగా నెల్లూరు నగర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా దిరిసాల రేవతి, ముదునూరు రోజారాణి, రూరల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శారద, షేక్ మస్తాన్బీలను నియమించారు.