పింఛన్ల తొలగింపుపై టీడీపీ నిరసన
ABN , First Publish Date - 2021-09-04T05:09:44+05:30 IST
అర్హత ఉన్నప్పటికీ పలువురికి సామాజిక పింఛన్లు తొలగించారంటూ టీడీపీ నాయకులు శుక్రవారం నెల్లూరు రూరల్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

నెల్లూరు రూరల్, సెప్టెంబరు 3 : అర్హత ఉన్నప్పటికీ పలువురికి సామాజిక పింఛన్లు తొలగించారంటూ టీడీపీ నాయకులు శుక్రవారం నెల్లూరు రూరల్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ అధికారికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు జెన్ని రమణయ్య, సపంత్కుమార్ మాట్లాడుతూ పింఛను పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రెండేళ్లుగా దానిని అమలు చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ రోజులు గడిపేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్, రంగారావు, సాబీర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.