ఇంటింటా పరిశుభ్రతతో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌

ABN , First Publish Date - 2021-10-08T05:13:39+05:30 IST

ఇంటింటా స్వచ్ఛమైన పరిశుభ్రతతో స్వచ్ఛాంద్ర ప్రదేశ్‌ ఏర్పడుతుందని నాయుడుపేట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కటకం దీపిక అన్నారు.

ఇంటింటా పరిశుభ్రతతో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌
నాయుడుపేట మున్సిపాలిటీలో ఇంటింటా మూడు చెత్తబుట్టలను అందజేస్తున్న చైర్‌ పర్సన్‌ దీపిక, కౌన్సిలర్‌ రామకృష్ణంరాజు తదితరులు

చైర్‌ పర్సన్‌ దీపిక 

నాయుడుపేట, అక్టోబరు 7 : ఇంటింటా స్వచ్ఛమైన పరిశుభ్రతతో స్వచ్ఛాంద్ర  ప్రదేశ్‌ ఏర్పడుతుందని నాయుడుపేట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కటకం దీపిక అన్నారు. గురువారం వైస్‌ చైర్మన్‌ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, 18, 11 వార్డు కౌన్సిలర్లు కొండూరు రామకృష్ణంరాజు, సాధు శాంతిలతో కలసి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు కలివేటి సంజీవయ్య ఆదేశాల మేర పట్టణంలోని ఇంటింటా తడి, పొడి, ప్రమాదకరమైనచెత్త సేకరణ కోసం మూడు బుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోఆప్షన్‌ సభ్యుడు చదలవాడ కుమార్‌, భావన్‌, కటకం జయరామయ్య, సిద్ధయ్య, మల్లికార్జున్‌రెడ్డి, చంద్రారెడ్డి, కౌన్సిలర్లు దారా రవి, పాపాడి చంద్రారెడ్డి, పాలేటి నాగార్జున, ఎస్‌కె షబ్బీర్‌, జరీనా, వెంకటేశ్వర్లు, సాధుమోహన్‌, సునీల్‌ ఉన్నారు.

Updated Date - 2021-10-08T05:13:39+05:30 IST