విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

ABN , First Publish Date - 2021-02-26T05:33:01+05:30 IST

లేగుంటపాడులోని మండల పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు గురువారం హెల్పింగ్‌ హోమ్స్‌ ట్రస్టు సభ్యులు పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, మాస్కులు పంపిణీ చేశారు.

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
పాఠ్యపుస్తకాలు అందిస్తున్నహెల్పింగ్‌ హోమ్స్‌ ట్రస్టు సభ్యులు

కోవూరు, ఫిబ్రవరి 25:  లేగుంటపాడులోని మండల పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు గురువారం హెల్పింగ్‌ హోమ్స్‌ ట్రస్టు సభ్యులు పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, మాస్కులు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  ప్రధానోపాధ్యాయుడు మంజాన్‌ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ట్రస్టు సభ్యులు సహకారం అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు దిలీప్‌, సభ్యులు రజ్వీ, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-02-26T05:33:01+05:30 IST