పాఠశాలల్లో వసతుల పరిశీలన
ABN , First Publish Date - 2021-10-08T04:22:06+05:30 IST
వెంకటగిరి పట్టణంలోని ఆర్వీఎం హైస్కూల్, బంగారుపేట ఆర్వీఎం హైస్కూళ్లలోని 413 మంది విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే ప్రకియ్రలో బాగంగా గురువారం ఆయా పాఠశాలల్లోని వసతులను డిప్యూటీ డీఈవో వెంకటేశ్వరరావు పరిశీలించారు.
![పాఠశాలల్లో వసతుల పరిశీలన](https://media.andhrajyothy.com/appimg/galleries/1921100710502038/10072021225044n58.gif)
వెంకటగిరి, అక్టోబరు 7: వెంకటగిరి పట్టణంలోని ఆర్వీఎం హైస్కూల్, బంగారుపేట ఆర్వీఎం హైస్కూళ్లలోని 413 మంది విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే ప్రకియ్రలో బాగంగా గురువారం ఆయా పాఠశాలల్లోని వసతులను డిప్యూటీ డీఈవో వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర పాఠశాలలతో పాటు, బంగారుపేట బీసీ కాలనీలోని పాఠశాలల్లో వసతులను పరిశీలించారు. ఈయన వెంట వల్లభదాస్ తదితరులు పాల్గొన్నారు.