సంగం ఆనకట్ట వారధిపై పెరుగుతున్న నీటి ప్రవాహం

ABN , First Publish Date - 2021-10-26T04:55:21+05:30 IST

సంగం ఆనకట్ట వారధిపై నీటి ప్రవాహం తగ్గి మళ్లీ సోమవారం సాయంత్రానికి పెరుగుతోంది. రెండురోజుల కిందట వరకు సుమారు 7150 క్యూసెక్కులు

సంగం ఆనకట్ట వారధిపై పెరుగుతున్న నీటి ప్రవాహం

సంగం, అక్టోబరు 25: సంగం ఆనకట్ట వారధిపై నీటి ప్రవాహం తగ్గి మళ్లీ సోమవారం సాయంత్రానికి పెరుగుతోంది. రెండురోజుల కిందట వరకు సుమారు 7150 క్యూసెక్కులు నీటి ప్రవాహం వస్తుంది. దీంతో ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.3 అడు గులు ఉంది. సోమశిల జలాశయంలో విడుదల చేసే నీటిని ఒక్కరోజు 4150 క్యూసెక్కులకు తగ్గించారు. దీంతో ఆదివారం సాయంత్రానికి సంగం ఆనకట్ట వద్ద నీటి మట్టం 8.2 అడుగులకు పడిపోయింది. వారధి మీద పాచి పట్టి ఉండడంతో గేట్లు తీయలేదు. అయినా ఆనకట్ట ఉత్తర, దక్షిణ రాకపోకలు అత్యవసరమైన వారు జొన్నవాడ, అప్పారావుపాళెం వైపు తిరిగి వెళ్లలేక వారధి ఫాలింగ్‌ షెట్టర్ల వద్ద నడిచి రాకపోకలు సాగించారు. దీంతో సెక్షన్‌ అధికారులు గేటు తీసి రాకపోకలు పునరుద్ధరించాలనుకునే సమయంలో మళ్లీ ఆదివారం సాయంత్రం సోమశిల అధికారులు నీటి విడుదలను 10 వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో ఆనకట్ట వద్ద సోమవారం సాయంత్రానికి నీటిమట్టం పెరుగుతుండడంతో రాకపోకల పునరుద్ధరణను అధికారులు విరమించారు. ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.


Updated Date - 2021-10-26T04:55:21+05:30 IST