తుమ్మాలమ్మ ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2021-07-13T04:22:54+05:30 IST

పాతదేవరాయపల్లి గ్రామ దేవత తుమ్మాలమ్మ ఆలయంలో సోమవారం చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని హుండీని పగుల కొట్టి దుండగులు

తుమ్మాలమ్మ ఆలయంలో చోరీ

అనంతసాగరం, జూలై 12: పాతదేవరాయపల్లి గ్రామ దేవత తుమ్మాలమ్మ ఆలయంలో సోమవారం చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని హుండీని పగుల కొట్టి దుండగులు అందులోని నగదు తీసుకెళ్లారు. సుమారు రూ.70 వేల నగదు  ఉంటుందని భావిస్తున్నారు. ఆలయ ధర్మకర్త చెన్నూరు శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రభాకర్‌ కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీంతో విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-07-13T04:22:54+05:30 IST