రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-01-27T04:25:51+05:30 IST
మండలంలోని శంకవరం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
వింజమూరు(ఉదయగిరి రూరల్), జనవరి 26: మండలంలోని శంకవరం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నల్లగొండ్ల గ్రామానికి చెందిన కార్తీక్ (21), శ్రీనివాసులరెడ్డి పని నిమిత్తం మోటార్ బైక్పై వింజమూరుకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా శంకవరం గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వీరు తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడ్డారు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం వింజమూరుకు తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు అప్పటికే కార్తీక్ మృతి చెందినట్లు నిర్థారించారు. తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాసులరెడ్డిని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఎస్ఐ బాజిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.