రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతి
ABN , First Publish Date - 2021-06-24T04:13:13+05:30 IST
స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో డౌన్లైన్లో 144వ కి.మీ వద్ద 6-8 స్తంభాల మధ్యలో ఓ గుర్తుతెలియని మహిళ (50) మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు తెలిపారు.
మనుబోలు, జూన్ 23: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో డౌన్లైన్లో 144వ కి.మీ వద్ద 6-8 స్తంభాల మధ్యలో ఓ గుర్తుతెలియని మహిళ (50) మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు తెలిపారు. దీంతో ఎస్ఐ మాలకొండయ్య ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు. మృతురాలు నీలంరంగు జాకెట్, తెల్లటి చారలు కలిగిన చీర ధరించి ఉంది. చేతులపై ముగ్గు ఆకారంలో పచ్చబొట్లు ఉన్నాయి. మృతదేహం పక్కన నీలంరంగు చెప్పులు ఉన్నాయి. ఈ క్రమంలో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తుతెలియని మహిళగా కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్లోంచి జారిపడి చనిపోయి ఉంటుందా, లేక ఆత్మహత్య చేసుకున్నదా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం నెల్లూరుకు తరలించారు. ఎస్ఐ వెంట పీసీ సీతారామ్ ఉన్నారు.