తపాలా ఉద్యోగుల ధర్నా

ABN , First Publish Date - 2021-02-02T04:21:15+05:30 IST

కాల్‌అటెన్షన్‌ డే కార్యక్రమంలో భాగంగా స్థానిక హెడ్‌ పోస్టాఫీసు వద్ద ఎన్‌ఎఫ్‌పీఈ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.

తపాలా ఉద్యోగుల ధర్నా
ధర్నా నిర్వహిస్తున్న పోస్టల్‌ ఉద్యోగులు

గూడూరు, ఫిబ్రవరి 1: కాల్‌అటెన్షన్‌ డే కార్యక్రమంలో భాగంగా స్థానిక హెడ్‌ పోస్టాఫీసు వద్ద ఎన్‌ఎఫ్‌పీఈ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకుడు సుధాకర్‌రాజు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అన్ని ట్రేడ్‌ యూనియన్‌లు వ్యతిరేకిస్తున్నా ఈ ప్రభుత్వం మొండివైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన కమిటీలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా డీఏ ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతోందన్నారు. కార్యక్రమంలో గోవింద్‌నాయక్‌, చంద్రశేఖర్‌, మల్లికార్జున, వరలక్ష్మి, రత్నకుమారి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T04:21:15+05:30 IST