పింఛన్ల తొలగింపు దారుణం
ABN , First Publish Date - 2021-09-04T03:46:13+05:30 IST
సామాజిక పింఛన్లను తొలగించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాయలంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 16 వేలు, నియోజకవర్గపరిధిలో 1,195 పింఛన్లను తొలగించారన్నారు.

మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్
గూడూరురూరల్, సెప్టెంబరు 3: సామాజిక పింఛన్లను తొలగించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాయలంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 16 వేలు, నియోజకవర్గపరిధిలో 1,195 పింఛన్లను తొలగించారన్నారు. చంద్రబాబు నాయుడు పింఛను మొత్తాన్ని రూ. 2 వేలకు పెంచగా, దానిని రూ.3 వేలు చేస్తానని, అవసరమైతే రూ.4వేల దాకా పెంచుతానని ఎన్నికల ప్రచారంలో జగన్ తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు ఎనిమిది నెలలు దాటినా రూ.2250 ఇస్తున్నారే గానీ పెంచిన పాపాన పోలేదన్నారు. రమ్య హత్య కేసులో నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని శనివారం సాయంత్రం టీడీపీ మహిళ, యువత, టీఎన్ఎస్ఎఫ్ల ఆధ్వర్యంలో టవర్క్లాక్సెంటర్ వద్ద నిర్వహించనున్న కొవ్వొత్తుల ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, మట్టం శ్రావణి, నెలబల్లి భాస్కర్రెడ్డి, కొండూరు వెంకటేశ్వర్లురాజు తదితరులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.