వృద్ధుడి అదృశ్యంపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-03-03T02:47:11+05:30 IST
మండలంలోని వెలికల్లు అరుంధతీ వాడకు చెందిన కర్లగుంట పెంచలయ్య అనే వృద్ధుడి అదృశ్యంపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చే
డక్కిలి, మార్చి 2 : మండలంలోని వెలికల్లు అరుంధతీ వాడకు చెందిన కర్లగుంట పెంచలయ్య అనే వృద్ధుడి అదృశ్యంపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెంచలయ్య ఫిబ్రవరి 17న తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. ఓటు వేసిన అనంతరం తిరిగి ఇంటికి చేరలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పెంచలయ్యకు చెందిన ఆదార్ కార్డు కుప్పాయపాళెం అటవీ ప్రాంతంలో పడి ఉన్నట్లు కొందరు పశువుల కాపరులు తమకు తెచ్చిఇచ్చారని వారు చెప్పారు. పెంచలయ్య ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వారు తెలిపారు.