బకాయిలను వెంటనే చెల్లించాలి
ABN , First Publish Date - 2021-10-19T03:32:02+05:30 IST
హౌసింగ్ లబ్ధిదారులకురాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ డిమాండ్ చేశారు.
గూడూరు, అక్టోబరు 18: హౌసింగ్ లబ్ధిదారులకురాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం టీడీపీ కార్యకర్తలు, లబ్ధిదారులతో కలసి స్థానిక హౌసింగ్ డీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 1273 మందికి సుమారు రూ. 3.65 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. గాంధీనగర్ సమీపంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. అనంతరం హౌసింగ్ డీఈ చలమయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నెలబల్లి భాస్కర్రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, కొండూరు వెంకటేశ్వర్లురాజు, వాటంబేడు శివకుమార్, ఇశ్రాయిల్కుమార్, దుద్దా రాఘవరెడ్డి, పుట్టి గోపాలయ్య, బత్తిని ప్రవీణ్, మైనంపాటి మోహన్, ,చంటి, సాయి, గణపర్తి కిషోర్నాయుడు, దువ్వూరు మధుసూదన్రెడ్డి, పెంచలయ్య, కోటేశ్వరరావు, భారతి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.